Ponnam Prabhakar : ముమ్మాటికీ ఇది బిఆర్ఎస్ , బిజెపి పార్టీల కుట్రనే – మంత్రి పొన్నం

Ponnam Prabhakar : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్న వేళ, ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించిందని , నేను ఎవరినీ లక్ష్యంగా చేసుకుని ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

Published By: HashtagU Telugu Desk
42 Percent Reservation

42 Percent Reservation

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) వివాదం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్న వేళ, ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించిందని , నేను ఎవరినీ లక్ష్యంగా చేసుకుని ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. నా మాటలను కట్ చేసి, కంటెక్స్ట్ మార్చి ప్రచారం చేస్తున్నారు” అని పొన్నం అన్నారు. ఈ వివాదం వెనుక బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. తాను పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నానని, అనవసరంగా ఈ వ్యవహారాన్ని పెద్దది చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Kamal Haasan : MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు – అన్నామలై

ఈ వివాదం వల్ల పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తో మాట్లాడానని తెలిపారు. “మా పార్టీ అంతర్గతంగా ఒక కుటుంబం లాంటిది. ఎవరైనా అపార్థం చేసుకున్నా, అది చర్చల ద్వారానే పరిష్కరించవచ్చు” అని స్పష్టం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, మీడియా మరియు ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించుకుంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ లు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఘటన రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత సున్నిత సంబంధాలపై వెలుగుని ప్రసరించింది. అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ ఇద్దరూ ముఖ్యమైన మంత్రులే కావడంతో, ఈ వివాదం పార్టీ ప్రతిష్ఠపై తాత్కాలిక ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. అయితే, పొన్నం చేసిన వివరణతో పరిస్థితి కొంత సమతుల్యమవుతుందని అంచనా. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టడం, అంతర్గత సమన్వయం కోసం చర్చలు ప్రారంభించడం ద్వారా ఈ ఇష్యూ త్వరలో ముగియొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

  Last Updated: 07 Oct 2025, 04:20 PM IST