Site icon HashtagU Telugu

Vem Narender Reddy : ‘‘నా పేరుతో వసూళ్లు చేసే వాళ్లను నమ్మకండి’’.. వేం నరేందర్ రెడ్డి ప్రకటన

Cm Revanth Vem Narender Reddy

Vem Narender Reddy : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్‌ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డి పేరు వాడుకొని ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూంలు ఇప్పిస్తామంటూ కొందరు మోసాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం వేం నరేందర్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇటీవల కొందరు వ్యక్తులు నా పేరును వాడుకొని డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్లు చేయిస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు.ఈవిషయం తెలిసిన వెంటనే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని ఆయన వెల్లడించారు. తన ఫిర్యాదును అందుకున్నాక.. తన పేరుతో మోసాలకు పాల్పడుతున్నవారిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని వేం నరేందర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇక నుంచి ఎవరైనా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మొద్దని కోరారు. తన పేరు చెప్పుకొని ఎవరైనా ఫోన్ కాల్స్ చేస్తే నేరుగా తమ ఆఫీస్ సిబ్బందిని వాట్సాప్ నంబరు 7566663335 ద్వారా సంప్రదించాలని వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy) కోరారు.

We’re now on WhatsApp. Click to Join

ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ 107 మందికి టోకరా వేసి రూ.1.29 కోట్ల వసూలు చేసిన ముఠా సభ్యులను ఇటీవలే తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నాయకుడు అనుగు సురేందర్‌ రెడ్డి (34)తో పాటు మెరీనా రోస్‌ (52), బొలుగుల అంజయ్య (34), బండ వెంకటేష్‌ (55), కర్తావత్‌ గోపాల్‌ నాయక్‌ (48), అనుగు హర్షిణి రెడ్డి (33)లను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, కీసర పోలీసులు అరెస్ట్‌ చేశారు. వేం నరేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరి అరెస్టు జరిగింది. నిందితుల వద్ద నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నకిలీ ఆలాట్‌మెంట్‌ లెటర్లు, కీసర ఆర్డీవో స్టాంపులు, 8 మొబైల్‌ ఫోన్లు, రూ. 1.97 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Also Read :Nagarjuna : ‘బిగ్‌బాస్’ నుంచి నాగార్జునను తప్పించండి.. హేతువాది బాబు గోగినేని సంచలన ట్వీట్