CM KCR: కేసీఆర్ దమ్ము ఏంటో దేశం మొత్తం చూసింది, ప్రతిపక్షాలపై సీఎం ఫైర్

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Kcr Twist

Kcr Twist

CM KCR: బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ప్రతిపక్ష నాయకులంతా ఎవరి కాళ్ల వద్ద ఉన్నారో తెలియదని, కానీ ఇప్పుడు తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఎదిగిందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పాలమూరు ప్రజలు బొంబాయికి వలస వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చారా? అని కేసీఆర్ ప్రశ్నించాడు. పాలమూరు జిల్లాలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నా పోరాటంలో నేను నిజాయితీగా ఉన్నందున నేను విజయం సాధించాను.

సరిపడా విద్యుత్, తాగునీరు, సాగునీరు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడ్డాం. నేడు దేశంలోనే 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఎదిగింది. ఇంటింటికీ నల్లానీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొండగల్‌కు రండి.. గాంధీ బామ్మ వద్దకు రా.. దేశం మొత్తం కేసీఆర్ దమ్మున్న తీరు చూసింది. కొత్తగా చూపించాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. 60 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. నేడు 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తోంది.

24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ ను వీడి టీఆర్ ఎస్ కండువా కప్పుకుంటానని జానా రెడ్డి సవాల్ విసిరారు. తర్వాత వెనుదిరిగారు. రైతుబంధు పథకానికి ఆద్యుడు కేసీఆర్. దశలవారీగా రైతు బంధును రూ.16 వేలకు పెంచనున్నారు. పాలమూరు- ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు పెట్టారు. ప్రాజెక్టులు పూర్తయితే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని, కేసులు పెట్టి ఆపారన్నారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని కేసీఆర్ అన్నారు.

Also Read: BRS Minister: బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే నా బలం.. బలగం: మంత్రి వేముల

  Last Updated: 26 Oct 2023, 05:39 PM IST