GO 317 : తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండున్నరేండ్లుగా జీవో నంబరు 317తో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ట్రెజరీ నుంచి జీతం అందుకుంటున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనానికి మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. జీవో 317తో తలెత్తిన సమస్యలు, ఉద్యోగులు-ఉపాధ్యాయుల అభిప్రాయాలు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇకపైన ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల లాంటి అంశాలను స్టడీ చేసి సిఫారసులు చేసేందుకు ఈ కమిటీని నియమించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన జీవో (నెం. 292) జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
మంత్రివర్గ సబ్ కమిటీకి ఛైర్మన్గా వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ వ్యవహరించారు. ఈ కమిటీలో మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు.ఈ కమిటీకి కన్వీనర్గా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జీవో 317 (GO 317) ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారితోనూ, వారు పనిచేస్తున్న హెచ్ఓడీలతోనూ, సంబంధిత డిపార్టుమెంట్ల సెక్రటరీలతోనూ కమిటీ చర్చించనుంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించే సమావేశాలకు ఆయా డిపార్టుమెంట్ల సెక్రటరీలు, హెచ్ఓడీలు హాజరై సహకారం అందిస్తారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుంది.