Harish Rao : పరవళ్లు తొకుతున్న కాళేశ్వర జలాలు…పరవశించిన హరీష్ రావు

Harish Rao : కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ, అక్కడే సెల్ఫీ దిగారు

Published By: HashtagU Telugu Desk
Harish Ranganayaka Sagar Ca

Harish Ranganayaka Sagar Ca

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) రంగనాయక సాగర్ కాలువ(Ranganayaka Sagar Canal)ను సందర్శించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ, అక్కడే సెల్ఫీ దిగారు. సాగునీరు అందడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలో సన్‌ఫ్లవర్ తోటలను సందర్శించిన హరీష్ రావు, రైతులతో ముచ్చటించారు. పంటకు తగిన ధర లేకపోవడం, మార్కెటింగ్ సమస్యల గురించి రైతులు వివరించగా, ఆయన ప్రభుత్వాన్ని తక్షణమే సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.

Kim Jong Un : అలా చేస్తే ఊరుకోం.. అమెరికాకు కిమ్‌ వార్నింగ్‌..

హరీష్ రావు తన ప్రసంగంలో సాగునీటి ప్రాధాన్యతను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్లే ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు అందాయని, దీని ద్వారా రైతులు లాభపడుతున్నారని గుర్తు చేశారు. సాగునీరు అందుబాటులోకి రావడం వల్ల ఎప్పుడూ నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొనే ఈ ప్రాంతాలు పచ్చగా మారాయని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతుల కోసం నిరంతరంగా పోరాడతామని, వారి హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా, వారికి సరైన మద్దతు లభించేలా కృషి చేస్తామని హరీష్ రావు అన్నారు. సాగునీరు, న్యాయమైన ధర, మార్కెట్ సదుపాయాలు అన్నీ కలిసినప్పుడే రైతులు అభివృద్ధి చెందగలరని, ఈ దిశగా ప్రభుత్వ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  Last Updated: 11 Feb 2025, 02:33 PM IST