Site icon HashtagU Telugu

Bandi Sanjay: జనవరి 22న తెలంగాణకు సెలవు ప్రకటించాలి: బండి సంజయ్

Bandi Sanjay Shocking Comments On CM KCR

Bandi Sanjay Shocking Comments On CM KCR

Bandi Sanjay: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పురస్కరించుకుని జనవరి 22న సెలవు ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ ఎల్లంతకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో స్వచ్ఛ తీర్థం స్వచ్ఛ కార్యక్రమంలో ఎంపీ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట హిందూ సోదర సోదరీమణులందరికీ పవిత్ర దినం, జీవితంలో ఒక్కసారైనా జరిగే కార్యక్రమంగా భావించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు సంజయ్ కుమార్ విలేకరులతో అన్నారు.

సంజయ్ కుమార్, పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవితో కలిసి రాములోకి బంగారు చీరను తయారుచేసిన  హరి ప్రసాద్ ఇంటికి చూశారు.  శ్రీరాముడి జీవితంలోని డిజైన్ ఫీచర్లతో కూడిన చీరను చూశారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉన్నారని.. గతంలో అగ్గిపెట్టేలో పట్టే చీరను తయారుచేసిన చరిత్ర సిరిసిల్ల జిల్లాకు ఉందని గుర్తు చేశారు.

ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ చీరను 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో రూపొందించారు. రామాయణ ఇతివృత్తం తెలియజేసే చిత్రాలతో ఈ చీరను చేనేత కళాకారుడు హరిప్రసాద్‌ తయారు చేశారు.