దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. మొబైల్ దొంగతనం, నకిలీ మొబైల్ పరికరాల ముప్పును అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అభివృద్ధి చేసిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR)ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర పోలీసులు 5,038 దొంగిలించబడిన, మిస్ అయిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
67.98 శాతం రికవరీతో తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 54.20 రికవరీ రేటుతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, 50.90 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. CEIR పోర్టల్ అధికారికంగా మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించబడింది, అయితే ఇది తెలంగాణలో పైలట్ ప్రాతిపదికన ఏప్రిల్ 19, 2023న ప్రారంభించబడింది.
110 రోజుల వ్యవధిలో మొత్తం 5,038 పోగొట్టుకున్న/దొంగిలించిన మొబైల్ పరికరాలను రికవరీ చేయగా, అందులో చివరి 1000 మొబైల్ పరికరాలను 16 రోజుల్లో రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అందజేశారు. ఈ ఫీట్ను సాధించడంలో యూనిట్ స్థాయి బృందాలకు సహాయం చేసినందుకు CEIR నోడల్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, CID, మహేష్ M. భగవత్ బృందాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ అభినందించారు.
Also Read: Nandamuri Natasimham: నిర్మాతల హీరో బాలయ్య బాబునే.. ఎందుకో తెలుసా!