MLA Rajagopal Reddy: 21న బీజేపీలోకి రాజగోపాల్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 21న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతున్నట్లు

Published By: HashtagU Telugu Desk
Rajagopal Reddy

Rajagopal Reddy

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 21న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో జరిగే సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా కాషాయ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. షాతో భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రకటన చేశారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఉన్నారు.

పార్టీలో చేరాల్సిందిగా అమిత్ షా తనను ఆహ్వానించారని, ఆహ్వానాన్ని మన్నించారని మునుగోడు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 8న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలుస్తానని, అసెంబ్లీకి రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక తెలంగాణలో పెనుమార్పు తెస్తుందని ఆయన జోస్యం చెప్పారు. తన స్వార్థం కోసం ఉప ఎన్నికలకు వెళ్లడం లేదని, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నారు. రాష్ట్ర రాజకీయాల గమనాన్ని మార్చేందుకు మునుగోడు ప్రజలు ఆదేశిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తగిన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా తప్పుడు వ్యక్తిని నియమించారని ఆరోపించిన రాజగోపాల్‌రెడ్డి.. ఆత్మగౌరవం ఉన్నవారు పార్టీలో ఉండరని వ్యాఖ్యానించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డికి ఆయన మరోసారి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అరాచక పాలనను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రమే అంతం చేయగలరని అన్నారు. ఉపఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతుండడంతో మునుగోడు, ప్రజల కోసమే తన నిర్ణయమని పేర్కొన్నారు.

  Last Updated: 06 Aug 2022, 01:50 PM IST