Telangana: మంచిర్యాల రోడ్డు ప్రమాదంలో భర్త , భార్య, కుమారుడు మృతి

మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..

Telangana: మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.

భీమిని మండలం వెంకటాపూర్‌కు చెందిన కోట తిరుపతి (40), తిరుమల (35), వారి కుమారుడు అంజేష్ (18) తాండూరు మండలం బోయపల్లి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బెల్లంపల్లి కన్నాల పెట్రోల్ బంకు సమీపంలో కుటుంబ సమేతంగా ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. బైక్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లడంతో వారి కుమారుడు అంజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉంది. అంజేష్‌ను మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అకాల మరణంతో మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ దేవయ్య, ఎస్సై ప్రవీణ్ సహా అధికారులు ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ