Kakatiya Dynasty: ఓరుగల్లు వేదికగా ‘కాకతీయ వైభవ సప్తాహం’

కాకతీయ సామ్రాజ్య చరిత్రను చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

  • Written By:
  • Updated On - July 6, 2022 / 12:43 PM IST

కాకతీయ సామ్రాజ్య చరిత్రను చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం జూలై 7వ తేదీ నుంచి వారం రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో ఈ కార్యక్రమం జూలై 7 నుంచి 13 వరకు జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్వీట్ చేశారు.

12వ, 14వ శతాబ్దాలలో కాకతీయ రాజవంశం ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో కూడిన ప్రాంతాన్ని పాలించింది. వారి రాజధాని తెలంగాణలోని వరంగల్. కాకతీయుల హయాంలో నిర్మించిన ట్యాంకులనే నేటికీ ఉపయోగిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘మిషన్‌ కాకతీయ’ పథకం కింద చెరువులను పునరుద్ధరించింది. వరంగల్ సమీపంలోని వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయంలో కాకతీయుల నాటి శిల్పకళ విశిష్ట శైలి కనిపిస్తుంది.