Site icon HashtagU Telugu

Employee : ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం

Employees' Working Hours

Employees' Working Hours

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పని వేళలపై (Employees’ working hours) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (Ease of Doing Business) లక్ష్యంగా ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 10 గంటల వరకు పనిచేయవచ్చు అని తెలిపింది. అయితే వారానికి మొత్తం పని గంటలు 48 గంటలను మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిమితిని మించి పని చేయాల్సిన అవసరం ఉంటే, యాజమాన్యాలు తప్పనిసరిగా ఓవర్‌టైమ్ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. దీనిద్వారా ఉద్యోగుల శ్రమకు తగిన గౌరవం లభించేలా ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.

Helmet : నకిలీ హెల్మెట్లపై కేంద్రం ఉక్కుపాదం..ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం కఠిన చర్యలు

అలాగే ప్రతి ఆరు గంటల పనికి కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశ్రాంతి సమయాన్ని కలిపినప్పటికీ, ఒక ఉద్యోగి ఏ రోజైనా పన్నెండు గంటలకుపైగా పనిచేయరాదని నిబంధనల్లో స్పష్టం చేసింది. ఈ మార్పులు ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడటంలో ఇది ఉపయుక్తమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Aditya Pharmacy MD: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య

ఈ సవరణలు వ్యాపార వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడతాయని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు శక్తివంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది కార్మిక సంఘాల డిమాండ్. విశ్రాంతి సమయాలు, ఓవర్‌టైమ్ చెల్లింపుల్లో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ నూతన మార్గదర్శకాలు ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంలో, వ్యాపార అభివృద్ధికి దోహదపడటంలో సమతుల్యత సాధించేలా ఉన్నాయి.