T Congress : రాహుల్ గాంధీ అనర్హత వేటుపై టీ కాంగ్రెస్ పోస్ట్ కార్డు ఉద్య‌మం

లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పోస్టుకార్డు ఉద్యమాన్ని

Published By: HashtagU Telugu Desk
Telangana Congress

Telangana Congress

లోక్‌సభ ఎంపీగా రాహుల్‌గాంధీపై అనర్హత వేటుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు ఆ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచనల మేరకు లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ పార్టీ పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామ‌ని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి టీపీసీసీ చీఫ్ వివరించారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా తదితర పార్టీల అన్ని విభాగాలు ఇందులో పాల్గొంటాయని తెలిపారు. ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేపడతున్నామ‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎల్పీ నేత బత్తిని విక్రమార్క ఆధ్వర్యంలో ఏప్రిల్ 8న మంచిర్యాలలో సత్యాగ్రహం కూడా చేస్తున్నామ‌ని.. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 25 వరకు ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’తో పాటు రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కూడా ఉద్యమిస్తామ‌న్నారు.

  Last Updated: 03 Apr 2023, 09:29 AM IST