KCR Girijana Bandhu: ‘గిరిజన బంధు’వు సీఎం కేసీఆర్!

హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

Published By: HashtagU Telugu Desk
CM kcr and telangana

CM KCR Telangana

హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్ర‌సంగించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించున్నట్టు వెల్లడించారు. షెడ్యూల్డ్ తెగల కోటాను 6% నుండి 10%కి పెంచే రిజర్వేషన్ G.O వచ్చే వారంలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని తెలంగాణ (KCR) తెలిపారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘ఆదివాసీ-బంజారాల ఆత్మీయ సభ’ పేరిట సీఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేశారు.

కేంద్రం మా జిఓను గుర్తించకపోతే ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉచ్చులా మారి పని చేస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న దళితుల బంధు పథకంతో పోల్చదగిన ‘గిరిజన బంధు’ కార్యక్రమాన్ని కూడా త్వరలో అమలులోకి తెస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సొంత భూమి లేని స్థానిక గిరిజనులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రైతుబంధు, దళితబంధు పథకం లాంటి అద్భుత పథకాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

  Last Updated: 17 Sep 2022, 06:24 PM IST