CM KCR: ముర్మును కలవనున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Kcr

Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈరోజు భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ ఈరోజు ఢిల్లీకి వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్‌ఎస్ ఎంపీలు హాజరుకాకపోవడం, అంతకుముందు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ రెండు రోజులు న్యూఢిల్లీలో ఉంటారు. కొన్ని పార్టీల నాయకులతో సమావేశమవుతారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

  Last Updated: 25 Jul 2022, 04:55 PM IST