Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి దాదాపు ఐదు వేలకు పైగా పాల్గొంటున్నారు. కాగా ఈ క్రీడల్లో పాల్గొంటున్న ఆయా క్రీడాకారులను తమ తమ రాష్ట్రాల, దేశాల ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ప్రోత్సహిస్తున్నారు. కాగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో యువ షూటర్ మను బాకర్ అదరగొట్టింది. మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. దేశం తరుపున తొలి పతాకం సాధించడంతో హర్యానా సీఎం అలాగే ప్రధాని మోడీ ఆమెను అభినందించారు. మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు.
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి రౌండ్లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు. బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధులతో ముఖ్యమంత్రి మాట్లాడి వారి అత్యుత్తమ ప్రదర్శనకు అభినందనలు తెలిపారు. అలాగే షూటర్ ఈషా సింగ్తో కూడా మాట్లాడి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం.
రాష్ట్రంలోని క్రీడాకారులందరూ తదుపరి రౌండ్లలో ఇదే ప్రదర్శనను కొనసాగించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆకాంక్షించారు.రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగంలో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనా క్లోట్జర్ను ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ అకుల 4-0తో స్వీడన్ క్రీడాకారిణి క్రిస్టినా కల్బర్గ్పై విజయం సాధించి 32వ రౌండ్లోకి ప్రవేశించింది. స్టార్ షట్లర్ మరియు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత ఆమె పారిస్ ఒలింపిక్స్ ప్రచారాన్ని మాల్దీవుల ఫాతిమత్ అబ్దుల్ రజాక్పై విజయంతో ప్రారంభించింది.
అంతకుముందు పారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్కు చారిత్రాత్మక కాంస్యం సాధించినందుకు షూటర్ మను భాకర్ను ముఖ్యమంత్రి అభినందించారు. ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది.మీరు సాధించిన విజయానికి గర్విస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
Also Read: IRE vs ZIM : ఫోర్ పోకుండా ఆపావు.. 5 రన్స్ వచ్చాయ్.. ఏం లాభం నాయనా..?