Farmers Protest: రైతుల నిరసనకు దిగొచ్చిన సర్కార్!

వరంగల్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అభివృద్ధికి ప్రభుత్వం రైతుల భూములను తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Warangal

Warangal

వరంగల్‌లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను తీసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ORR ప్రాజెక్ట్ కోసం వరంగల్ నగరం చుట్టుపక్కల 28 గ్రామాలలో భూమిని సేకరించే ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన బాట పట్టారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ కోసం భూ యజమానుల అనుమతి కోరుతూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 41 కిలోమీటర్ల మేర ఓఆర్‌ఆర్‌ను అభివృద్ధి చేసేందుకు హన్మకొండ, వరంగల్ మరియు జనగాం మూడు జిల్లాల్లోని 28 గ్రామాల పరిధిలో సర్వే పనులను ప్రారంభించింది.

అయితే భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు రైతులు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)ని ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై రాస్తారోకోకు దిగడంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైతుల ఉద్యమానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మద్దతు పలికాయి.  రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) అభివృద్ధి ప్రాజెక్టుపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చించారు. దీంతో భూసేకరణ ను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

  Last Updated: 31 May 2022, 03:21 PM IST