తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. గురువారం గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి.. జగదాంబికా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో పోతు రాజులతో కలిసి మంత్రులు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది బోనాలకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీక బోనాలని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి బోనాలు ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వం తరుపున గోల్కొండ కోటలో జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.