New Delhi: తెలంగాణ ఎన్నికలపై ఢిల్లీలో వ్యూహరచన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
New Delhi (1)

New Delhi (1)

New Delhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరగనుంది. జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ చగ్‌, ఎంపీ ప్రకాశ్‌ జవదేకర్‌, తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్‌, జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సాల్‌, పార్టీ సీనియర్‌ నేత వివేక్‌ వెంకట్‌ స్వామి, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్‌ సంజయ్‌ బండి తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ లోని 119 సీట్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జాతీయ రాజకీయాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ సమావేశం బిజెపికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.

మరోవైపు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోరు నడుస్తోంది. అయితే తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ ఆరోపించారు. ఈ సంకీర్ణంలో ఏఐఎంఐఎం కూడా ఉంది రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 9న ప్రకటించింది.

2018లో మునుపటి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ 119 స్థానాలకు గాను 88 స్థానాలతో 47.4 శాతం ఓట్లను రాబట్టింది. కాంగ్రెస్ 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 28.7 శాతంతో కాంగ్రెస్ నిలిచింది.

Also Read: Chandrababu : చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు

  Last Updated: 19 Oct 2023, 01:19 PM IST