`వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా` కేసీఆర్` కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డాడు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రాజీనామా చేయాలని కోరాడు. దేశ భక్తిలేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యాడు. నాలుకలు కోసే దమ్ము దైర్యం ఉందా? అంటూ నిలదీశాడు. సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్న తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ దుయ్యబట్టాడు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడున్నాడో చెప్పాలని కోరాడు. మందుకు ఇచ్చినంత విలువ తెలంగాణకు ఇవ్వనటువంటి పచ్చి దగాకోరుగా కేసీఆర్ ను అభివర్ణించాడు.
కేసీఆర్ చెప్పిన అబద్దాలపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యాడు. తెలంగాణ ద్రోహి కేసీఆర్ ఆంటూ చిట్టాను విప్పాడు. వరి పంట విషయంలో కేంద్రం కొనుగోలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన ఆర్డర్ కాపీని బయటపెట్టాడు. ఉప్పుడు బియ్యం మాత్రమే కొనుగోలు చేయమని కేంద్రం చెప్పిందని, వరి పంటను కొనుగోలు చేయమని ఎక్కడ చెప్పారో తేల్చాలని నిలదీశాడు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏడాదిదికి ఎంత నిధులను ఇచ్చారో బండి బయటపెట్టాడు. డీజిల్, పెట్రోలుపై వ్యాట్ ను 2015లో పెంచుతూ జారీ చేసిన జీవోను బండి విడుదల చేశాడు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టాడు. కృష్ణా నది జలాలపై కేసీఆర్ చేసిన మోసాన్ని బండి వివరించాడు.
Also Read : కేసీఆర్ జైలు..బండి నాలుక కోత..తెలంగాణలో పొలిటికల్ హీట్
తెలంగాణకు రావాల్సిన వాటాను రాబట్టుకోకుండా కేవలం 299టీఎంసీల నీటి వాటాకు అంగీకరిస్తూ కేసీఆర్ చేసిన సంతకంపై మండపడ్డాడు. రాయలసీమను రతనాల సీమగా మార్చుతానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అన్నీ అబద్దాలు చెబుతున్నాడని మండిపడ్డాడు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టాడు. రైతులను మోసం చేయకుండా వరి పంటను కొనుగోలు చేయాలని కేసీఆర్ కు హితవు పలికాడు.
తెలంగాణ కోసం చేసిన దొంగదీక్ష గురించి బండి ప్రస్తావించాడు. ఆనాడు లిక్విడ్ ప్లూయిడ్ ను తీసుకున్న తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటూ ధ్వజం మెత్తాడు.