Site icon HashtagU Telugu

Telangana: వారం పాటు నిరసన వాయిదా వేసిన అర్చకులు

Telangana

Telangana

Telangana: దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యతరహా ఆలయాల్లోని అర్చకులకు ధూప దీప నైవైద్య పథకం కింద గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు పలుమార్లు విన్నవించిన నేపథ్యంలో ఈ రోజు మంగళవారం చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. అయితే ఎండోమెంట్ కమిషనర్ వి అనిల్ కుమార్ హైదరాబాద్‌లో ఆలయ అర్చకుల ప్రతినిధులతో భేటీ అయి తమ నిరసనను వారం రోజుల పాటు వాయిదా వేయాలని ఒప్పించి, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం కొత్తది కావడంతోపాటు మా పోరాటాన్ని వచ్చే వారానికి వాయిదా వేసేందుకు అంగీకరించామని డీడీఎన్ అర్చకుల సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మే 31, 2023న వేద, శాస్త్ర పండితుల నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.2,500 నుంచి రూ.5,000కు పెంచుతూ, పథకం లబ్ధిదారుల అర్హత వయస్సును 75 నుంచి 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త ప్రభుత్వం అర్చకుల నెలవారీ గౌరవ వేతనాల చెల్లింపు కోసం మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి హామీ చేయలేదని అన్నారు. తెలంగాణ అర్చక సంఘం జేఏసీ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం వచ్చినందున జీతాలు ఇవ్వకపోవడాన్ని ఆందోళనకు గురిచేస్తున్నామన్నారు.

Also Read: TDP vs Janasena: టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు