గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ (Congress) తో పొత్తు కోసం ఎదురుచూసిన సీపీఎం (CPM)..కాంగ్రెస్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ 14 మందిని బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) మాట్లాడుతూ..ఎన్నికల్లో మూడు నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. కమ్యూనిస్టుల వల్లనే.. సమాచార హక్కు.. ఉపాధి హామీ వచ్చిందన్నారు. మొదటిది.. సీపీఎం కి అసెంబ్లీ కి వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు. రెండోది.. వామపక్ష పార్టీలను బలపరచండి అని పిలుపునిచ్చారు. ఇక మూడో నినాదం.. బీజేపీ దుర్మార్గ పాలనకు స్వస్తి పలకాలని కోరారు. బీజేపీ గెలిచే చోట.. ఓడించ గలిగే అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పదలుచుకున్నామన్నారని తెలిపారు. అలాగే జర్నలిస్టులకు మూడు వందల గజాలు స్థలం, 10 వేలు పెన్షన్ ఇస్వామని హామీ ఇచ్చారు.
Read Also : Venkatesh -Mahesh Babu : పేకాట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న వెంకీ – మహేష్