CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పాత కేసులో.. పిటిషనర్, లాయర్లకు సుప్రీంకోర్టు షాక్

CM Revanth Reddy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అసభ్యకర ఆరోపణలు చేసిన పిటిషనర్, ఇద్దరు న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

CM Revanth Reddy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అసభ్యకర ఆరోపణలు చేసిన పిటిషనర్, ఇద్దరు న్యాయవాదులపై సుప్రీంకోర్టు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీంకోర్టు పేర్కొన్నది కేవలం ఆడిట్ క్షమాపణలు చెప్పడం తగదు, నేరుగా ఆ న్యాయమూర్తికి బేషరతు లేకుండా క్షమాపణలు చేయాలని. న్యాయమూర్తుల గౌరవానికి హానికరం చేసే, అసత్య ఆరోపణలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు మన్నించదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

2016లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విచారణలో, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసుమీ భట్టాచార్య పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించేందుకు న్యాయమూర్తి కొద్ది నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జులై 29న విచారణ జరిపింది. పిటిషనర్ పెద్దిరాజుతో పాటు ఆయన తరఫు న్యాయవాదులు రితేష్ పాటిల్, నితిన్ మిశ్రాలపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టింది.

Telangana BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్

విచారణలో, పిటిషనర్ తరపున న్యాయవాదులు అఫిడవిట్ ద్వారా క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. దీన్ని స్వీకరించిన సీజేఐ జస్టిస్ గవాయ్ “మీరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, కాబట్టి క్షమాపణలు కూడా ఆమెకు నేరుగా చెప్పాలి. ఇటీవల కొంతమంది న్యాయవాదులు ట్రయల్ కోర్టులు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుమానాలు పెంచుతున్నారు, ముఖ్యంగా రాజకీయ నేతల కేసుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇది అంగీకరించలేం. హైకోర్టు న్యాయమూర్తుల గౌరవాన్ని కాపాడటం సుప్రీంకోర్టు బాధ్యత” అని స్పష్టం చేశారు.

ఈ కేసులో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను పిటిషన్‌ను తిరిగి తెరిచి జస్టిస్ మౌసుమీ భట్టాచార్య సమక్షంలో క్షమాపణల అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పిటిషనర్ క్షమాపణలను పరిగణనలోకి తీసుకోవడం లేదా తీసుకోకపోవడం న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది. హైకోర్టులో ప్రక్రియ పూర్తయ్యాక సుప్రీంకోర్టు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Gut Health : మీ ఒంట్లో విషవాయువులు పెరిగిపోతున్నాయా..? వన్స్ గట్ హెల్త్ చెక్ చేసుకోండి

  Last Updated: 12 Aug 2025, 10:39 AM IST