Delhi Liquor Scam: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Published By: HashtagU Telugu Desk
Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ నేడు జరగాల్సి ఉండగా మార్చి 13కి వాయిదా పడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమె ఇంట్లో విచారణ జరపాలని వాదిస్తున్నారు కవిత. మరోవైపు ఇతర కార్యక్రమాలు ఉన్నందున ఈడీ ఎదుట హాజరు కాలేనని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.

కోర్టు గడువు ముగిసిన వెంటనే తదుపరి విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును ఆశ్రయించారు. మార్చి 13న చూస్తామని ధర్మాసనం తెలిపింది. మద్యం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ జారీ చేసిన నోటీసును కవిత గత ఏడాది సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

గతంలో ఆమె పిటిషన్ నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో ముడిపడి ఉన్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను విడివిడిగా విచారిస్తామని జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం గత విచారణలో స్పష్టం చేసింది. 3 కేసులు వేర్వేరుగా ఉన్నాయని, వాటిని కలిసి విచారించే ప్రసక్తే లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

Also Read: Health: కార్డియాక్ అరెస్టు తో జర జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

  Last Updated: 29 Feb 2024, 12:15 AM IST