Palvai Sravanthi: పాల్వాయి స్రవంతి బలాలు, బలహీనతలు ఇవే!

కాంగ్రెస్‌ టికెట్‌ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ లు టికెట్‌ను ఆశించారు.

  • Written By:
  • Updated On - September 9, 2022 / 04:06 PM IST

మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం స్రవంతితో పాటు స్థానిక నేతలు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, కైలాష్‌ లు టికెట్‌ను ఆశించారు. అందులో ఇద్దరు పేర్లను తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ కు పంపింది. అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత పాల్వాయి స్రవంతిని అధిష్టానం ఖరారు చేసింది. అయితే పాల్వాయి స్రవంతి బలాలు, బలహీనతలు ఏమిటంటే..

బలాలు..

పాల్వాయి గోవర్థన్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా సుదిర్ఘ కాలం పనిచేశారు. పాల్వాయి స్రవంతి దివంగత నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కూతురు కావడం ఆమెకు కలిసొచ్చే అంశం.
పాల్వాయి స్రవంతికి దాదాపు 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అతి చిన్న వయస్సులోనే ఆమె ఏఐసీసీ మెంబర్‌గా పనిచేశారు.
పాల్వాయి గోవర్థన్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పుడే.. స్రవంతి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంది. అప్పుడే కార్యకర్తలతో నిత్యం మాట్లాడుతూ.. వారి సమస్యలు పరిష్కరించేది.
పాల్వాయి గోవర్థన్ రెడ్డి అచ్చంపేట ప్రాంతంలో పుట్టినా.. పాల్వాయి స్రవంతి పుట్టి పెరిగింది అంతా మునుగోడు నియోజకవర్గంలోనే. చండూర్ మండలం ఇడికూడ గ్రామంలో స్రవంతి జన్మించారు. ఇప్పటికీ వారి సోదరుడు అదే గ్రామంలో ఉంటున్నారు. సర్పంచిగా కూడా పనిచేశారు.
పార్టీకోసం దీర్ఘ కాలంగా పనిచేసినా.. సరైన అవకాశాలు రాలేదు అనే సానుభూతి పాల్వాయి స్రవంతికి కలిసొచ్చే ప్రధాన అంశం.
నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో.. పాల్వాయి స్రవంతి సుపరిచితురాలు కావడం పెద్ద ప్లస్ పాయింట్. ఏ గ్రామానికి వెళ్లినా ఆమెకు మంచి గుర్తింపు ఉంటుంది. ఆమె నాన్న హయాంలోనే మునుగోడు అభివృద్ధి జరిగిందని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు.

బలహీనతలు

పాల్వాయి గోవర్థన్ రెడ్డి అంటే.. ఫస్ట్ గుర్తొచ్చేది కాంగ్రెస్. అలాంటి కుటుంబంలో జన్మించిన స్రవంతి 2014లో పార్టీని ఎదురించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పార్టీకి నష్టం చేశారనే టాక్ ఉంది.
పాల్వాయి స్రవంతి పుట్టి, పెరిగింది మునుగోడులోనే అయినా.. ఆమె మెట్టినిల్లు నెల్లూరు జిల్లా. ప్రత్యర్థులకు ఇది ఆయుధంగా మారింది.
మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి వచ్చాక.. పాల్వాయి స్రవంతి ఓ కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడారు. ఇది రాజకీయంగా రచ్చగా మారింది.