సొనాటా సాఫ్ట్వేర్ త్వరలో తన కార్యకలాపాలను నల్గొండలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. నల్గొండ ఐటీ టవర్లో 200 ఉద్యోగాలను ఈ కంపెనీ అందించనుంది. రాష్ట్రంలోని టైర్-2 పట్టణాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయి. అమెరికాలోని బోస్టన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ఈవీపీ, సొనాటా సాఫ్ట్వేర్ శ్రీని వీరవెల్లి సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్పై దృష్టి సారిస్తూ.. బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్, హెల్త్కేర్ మరియు లైఫ్ సైన్సెస్ వంటి విస్తృత శ్రేణి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలపై పని చేయడానికి ఇంజనీర్లకు ఇది సహకార కార్యస్థలం అని సోనాటా సంస్థ పేర్కొంది. ఈ చొరవ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నైపుణ్యాలు మరియు సాంకేతికతలను లోతుగా పరిశోధించడానికి ఆసక్తిగా ఉన్న యువతకు క్రాస్-స్కిల్లింగ్ మరియు అప్స్కిల్లింగ్ అవకాశాలను కూడా అందిస్తుంది. ఈ సమావేశంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.