Site icon HashtagU Telugu

Sheeps Distribution Scam : రూ.700 కోట్లు ఏమయ్యాయ్ ? గొర్రెల పంపిణీ స్కాంపై ఈడీ ఫోకస్

Sheeps Distribution Scam

Sheeps Distribution Scam

Sheeps Distribution Scam : బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో స్కాం జరిగిందనే ఆరోపణలపై  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు మొదలైంది. ఈ స్కీంకు సంబంధించిన దాదాపు రూ.700 కోట్లు దారిమళ్లాయని ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ఆ అంశంపై ఈడీ ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో ఇప్పటివరకు ఏసీబీ 10 మంది నిందితుల్ని గుర్తించి, 8 మంది పశుసంవర్ధకశాఖ అధికారులను అరెస్టు చేసింది. దారి మళ్లిన సొమ్ములో 10 మంది నిందితులు వాటాదారులు మాత్రమేనని.. మిగిలిన సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందనే విషయాన్ని తేల్చడంపైనే ఈడీ ఫోకస్  చేయనుంది. గొర్రెల కొనుగోలుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము ఎవరి అకౌంట్లలోకి వెళ్లిందనే సమాచారాన్ని  సేకరించే పనిలో ఈడీ నిమగ్నమైంది.ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :New Registration Charges : ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు.. కసరత్తు షురూ

Also Read : Popular Father Characters : ‘ఆ నలుగురు’.. తండ్రి పాత్రల్లో వారికి వారే సాటి!