She Shuttle Bus: హైదరాబాద్ లో మొదలైన షీ షటిల్ బస్సు సర్వీస్.. మహిళలకు ఉచిత ప్రయాణం

సిటీలో మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.

సిటీలో మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ (She Shuttle) సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ షీ షటిల్ (She Shuttle) బస్సును తయారుచేశారని తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారని వివరించారు. భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు కూడా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిధి కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read:  Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ చాలించి.. ఇక ఆఫీసుకు రండి.. ఉద్యోగులకు ప్రముఖ కంపెనీల ఆర్డర్