Munugodu Politics: రాజగోపాల్ రెడ్డికి షాక్.. వాళ్లంతా టీఆర్ఎస్ లోకి!

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షాక్ ఇస్తూ కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణిలోని పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

Published By: HashtagU Telugu Desk
Rajagopal Reddy

Rajagopal Reddy

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి షాక్ ఇస్తూ కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణిలోని పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో ఎంపీటీసీ ఎస్‌. కవితా విద్యాసాగర్‌, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శి, రావిగూడెం సర్పంచ్‌ గుర్రం సత్యం, ఇతర సర్పంచ్‌లు జె.మహేశ్వరి, ఎన్‌.రాధా రమేష్‌, బి.సైదులు, వి.జగన్‌గౌడ్‌, పి.పద్మ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రాజగోపాల్‌రెడ్డి అనుచరులు అయినప్పటికీ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి చెందిన పోస్టర్లు కలకలం రేపగా, తాజాగా ఆయన అనుచరులు ఇతర పార్టీలో చేరడంతో ఆయనకు షాక్ తగిలినట్టయింది.

ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని, టీఆర్‌ఎస్‌కు వామపక్షాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, టీఆర్‌ఎస్ ఈడీకి లేదా మరే ఇతర సంస్థకు భయపడదని, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకునే కేంద్రం పన్నాగాన్ని ఇలాంటి బెదిరింపు సూచిస్తోందని అన్నారు. కాగా మునుగోడు పొలిటికల్ ఫైట్ కోసం సీఎం కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.

  Last Updated: 15 Aug 2022, 12:44 PM IST