ఖమ్మం జిల్లాలో జరిగిన సీపీఎం రైతు సంఘం నేత సామినేని రామారావు హత్య రాష్ట్రాన్ని షాక్కు గురి చేసింది. ఈ ఘటన చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఉదయం జరిగింది. ప్రతి రోజు మాదిరిగా రామారావు ఉదయాన్నే వాకింగ్కు వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. దుండగులు కత్తులతో గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు రామారావు రక్తసిక్త స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. రైతు సమస్యలపై ఎప్పుడూ ముందుండి పోరాడే నాయకుడిగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.
Weight Loss: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే పరగడుపున ఈ జ్యూస్ లు తాగాల్సిందే!
ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందా? లేక వ్యక్తిగత విభేదాలా? అనే దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రామారావు ఇటీవల కూడా వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం బహిరంగ సభల్లో పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానికంగా ఆయనకు రాజకీయ విరోధులు కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని చుట్టుముట్టి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్లు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగులు మోటార్సైకిల్పై వచ్చి దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో పాతర్లపాడు, చింతకాని పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
Jemimah Rodrigues: భారత్ను ఫైనల్స్కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్!
రామారావు హత్యపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “రాజకీయ హింసకు తెలంగాణలో స్థానం లేదు. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. వారిని పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు. రైతు నాయకుడిపై జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. సీపీఎం పార్టీ నాయకులు కూడా భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ, ఈ హత్యపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు రామారావు కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

