రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0లో సల్మాన్ ఖాన్ పాల్గొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. చెట్ల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తూ మొక్కలు నాటే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తుల కారణంగా మన కళ్ల ముందే ఈ దేశంలో చాలా మంది చనిపోవడం బాధాకరం అని ఆయన అన్నారు.
వాతావరణ మార్పుల వల్ల కలిగే అనర్థాలను అరికట్టాలంటే చెట్లను నాటడం ఒక్కటే మార్గం. జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ చొరవ ద్వారా బాటలు వేశారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం కొనసాగించినట్లయితే భూగోళం భవిష్యత్తును కాపాడుకోవచ్చని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0లో చేరి మొక్కలు నాటాలని తన అభిమానులను కోరారు. ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్కుమార్ మాట్లాడుతూ.. ఈ ఛాలెంజ్లో పాల్గొని తన అభిమానులను ఇలాగే ప్రోత్సహించినందుకు సల్మాన్ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు.
#GreenIndiaChallenge is delighted to have the Bollywood Sultan in Hyderabad. Euphoric to have the company of @BeingSalmanKhan to plant saplings. He not only accept our invitation but felt proud to be part of #GIC. This would definitely inspire millions of his fanbase to replicate pic.twitter.com/yylnOdqO2P
— Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022