తెలంగాణ సర్కార్ ఇస్తున్న రైతు బంధు నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈనెల 28 నుంచి వానాకాలం పంట పెట్టుబడికి రైతు బంధు నిధులను రిలీజ్ చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతుల అకౌంట్లోకి రైతు బంధు నిధులను జమ చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. గతంలో మాదిరిగానే వరస క్రమంలో రైతుల అకౌంట్లో రైతు బంధు నిధులను సర్కార్ జమ చేసే అవకాశం ఉంది.
ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.
— Telangana CMO (@TelanganaCMO) June 22, 2022