Site icon HashtagU Telugu

Rythu Bharosa : ఈరోజు ఒక్క రోజే రూ.530 కోట్లు జమ – మంత్రి తుమ్మల

Rythu Bharosa Tummala

Rythu Bharosa Tummala

ఈరోజు ఒక్క రోజే రైతు భరోసా (Rythu Bharosa) కోసం రూ.530 కోట్లు బదిలీ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) తెలిపారు. తాజాగా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకం గురించి మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం అమలు వేగంగా కొనసాగుతుందని , ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందని, అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Saif Ali Khan : సైఫ్‌పై దాడి కేసులో ట్విస్ట్.. బెంగాలీ మహిళ అరెస్ట్.. ఎవరంటే..

రైతు భరోసా నగదు తొలి విడతలో మండలానికి చెందిన ఒక్కో గ్రామంలో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడంతోపాటు ఆర్థిక సాయం కూడా అందించడమే ఈ పథక లక్ష్యమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వెల్లడించారు. ఈరోజు ఒక్క రోజే మొత్తం 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ డబ్బులు రైతులు తక్షణ అవసరాలకు ఉపయోగించుకునేలా బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు రైతు భరోసా నగదు అందించామని మంత్రి పేర్కొన్నారు. ఈ నగదు మొత్తం రూ.530 కోట్లుగా ఉండగా, ఇది రైతుల పంట నష్టాల నివారణకు ఉపయోగపడుతుందని చెప్పారు. రైతు భరోసా సొమ్మును బ్యాంకుల ద్వారా తక్షణం తీసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తామని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.