Site icon HashtagU Telugu

Fake Currency : హైద‌రాబాద్‌లో రూ.2.5 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం

Fake Currency Imresizer

Fake Currency Imresizer

హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ జోన్ పోలీసులు, మీర్‌చౌక్ పోలీసులతో కలిసి గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన సయ్యద్ అన్సార్ (27), హైదరాబాద్‌కు చెందిన షేక్ ఇమ్రాన్ (33)గా గుర్తించారు. శేఖ‌ర్‌ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నకిలీ కరెన్సీ నోట్లకు ప్రధాన ఆధారం ష‌కీర్‌ అని పోలీసులు తెలిపారు. రూ.2,5ల‌క్ష‌ల విలువైన 100, 200, 500, 2000 నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు ష‌కీర్ కర్ణాటకలో కంప్యూటర్, జిరాక్స్ సెంటర్ నడుపుతున్నాడు. నకిలీ నోట్ల ప్రింటింగ్‌లో వ్యూహరచన చేసి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకున్నాడని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అతను ప్రింటింగ్ ప్రారంభించిన తర్వాత, అతను తన బంధువు సయ్యద్ అన్సార్‌ను సంప్రదించి మార్కెట్లో కరెన్సీని చెలామణి చేయమని ఆదేశించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్‌ పోలీసులు, మిర్‌చౌక్‌ పోలీసులతో కలిసి ఎంజీబీఎస్‌ అవుట్‌ గేట్‌ వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మీర్‌చౌక్ పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.