34 Minor Boys Rescued: 34 మంది చిన్నారుల అక్రమ రవాణా.. పోలీసులు అదుపులో నలుగురు దళారులు

కాజీపేట (Kazipet) రైల్వే స్టేషన్‌లో బీహార్‌ నుంచి సికింద్రాబాద్‌కు, మరికొందరిని కర్ణాటకకు రవాణా చేస్తున్న 34 మంది చిన్నారుల (34 Minor Boys Rescued)ను తెలంగాణ పోలీసులతో కలిసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బుధవారం రాత్రి రక్షించింది.

Published By: HashtagU Telugu Desk
34 Minor Boys Rescued

Resizeimagesize (1280 X 720) 11zon

కాజీపేట (Kazipet) రైల్వే స్టేషన్‌లో బీహార్‌ నుంచి సికింద్రాబాద్‌కు, మరికొందరిని కర్ణాటకకు రవాణా చేస్తున్న 34 మంది చిన్నారుల (34 Minor Boys Rescued)ను తెలంగాణ పోలీసులతో కలిసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) బుధవారం రాత్రి రక్షించింది. రక్షించబడిన పిల్లలందరూ 14- 17 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలురు అని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు వేగంగా పనిచేసి కాజీపేట జంక్షన్ వద్ద ఈ చిన్నారులను గుర్తించగలిగారు. రక్షించబడిన పిల్లలను వారి భద్రత కోసం పిల్లల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. నలుగురు మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

“అందరూ దర్బంగా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అబ్బాయిలే. ఒక క్లూ ఆధారంగా మేము శోధన నిర్వహించి 34 మంది అబ్బాయిలను కనుగొన్నాము. ఈ బాలురిని కూలి కోసం తరలిస్తున్నారు. వారిలో కొందరు తమకు హైదరాబాద్‌లో సంబంధాలు ఉన్నాయని, వారి అభ్యర్థన మేరకు వచ్చామని మాకు చెప్పారు, ”అని అధికారి తెలిపారు.

Also Read: Poonch Terrorist Attack: జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఎన్ఐఏ విచారణ.. మృతిచెందిన జవాన్లు వీరే..!

పిల్లలు ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ (DCPO) సంరక్షణలో ఉన్నారు. “వారి తల్లిదండ్రులు, సంరక్షకులను సంప్రదించిన తర్వాత పిల్లలను ఇంటికి తిరిగి పంపిస్తామని” ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. అయితే, పిల్లలతో పాటు ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. వీరిని తరలిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. “మా దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది,” అని అధికారి తెలిపారు.

  Last Updated: 21 Apr 2023, 09:24 AM IST