Revanth Reddy: కేటీఆర్‌ టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా.. దాన్ని సృష్టించిందీ కాంగ్రెస్సే-రేవంత్ రెడ్డి!

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 10:21 PM IST

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్..కేటీఆర్ సంధించిన ట్వీట్ కు టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఘాటుగా జవాబు చెప్పారు. ఈ మేరకు ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడించింది. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ రీ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు టూరిస్టులు వస్తుంటారు..వెళ్తుంటారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ట్వీట్ పై వెంటనే స్పందించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్టు ప్రాంతం కావచ్చంటూ కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణను కేటీఆర్ పర్యాటక ప్రాంతంగా పరిగణిస్తుంటే…తాము మాత్రం ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలంగానే భావిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం తెలంగాణ అని అన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ వక్రమాటల ప్రకారం ఇది టూరిస్టు ప్లేస్ అనుకున్నా…దానినిసృష్టించింది కాంగ్రెస్సే అంటూ ఘాటు రిప్లే ఇచ్చారు.