Drug Tests: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Drug Tests: ఇటీవల హైదరాబాద్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీ సహా ఇతర విద్యా సంస్థల దగ్గర నిర్వహించిన ఆపరేషన్‌లో 84 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించారు

Published By: HashtagU Telugu Desk
Drags Test

Drags Test

తెలంగాణలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో, ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో డ్రగ్ టెస్టులు నిర్వహించాలని ప్రణాళికలు వేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీ సహా ఇతర విద్యా సంస్థల దగ్గర నిర్వహించిన ఆపరేషన్‌లో 84 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించారు. వీరిలో 26 మంది వైద్య విద్యార్థులు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఒక గంజాయి పెడ్లర్, ఒక అంతర్-రాష్ట్ర సరఫరాదారుని పట్టుకొని, రూ. 1.5 లక్షల విలువైన 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Emergency Numbers: హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. అత్య‌వ‌స‌ర నంబ‌ర్లు ప్ర‌క‌టించిన అధికారులు!

మెడిసిటీ మెడికల్ కాలేజీలో 8 మంది విద్యార్థులు గంజాయి వినియోగంలో పాజిటివ్‌గా తేలారు. అంతేకాకుండా, యూపీఐ లావాదేవీల ఆధారంగా గుర్తించిన 32 మంది వినియోగదారులలో 9 మంది డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలారు. ఈ 9 మందిలో 8 మంది మెడిసిటీ మెడికల్ కాలేజీ విద్యార్థులే. అన్నీ తెలిసిన మెడికల్ విద్యార్థులే ఇలాంటి అలవాట్లకు బానిసలైతే మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి EAGLE అన్ని విద్యా సంస్థలపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 26, 2025న రాష్ట్రాన్ని డ్రగ్-ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తమ క్యాంపస్‌లలో డ్రగ్స్ వినియోగం జరిగితే బాధ్యత వహించాలని, సమీపంలోని దుకాణాల్లో గంజాయి చాక్లెట్ల విక్రయం వంటి అనుమానాస్పద కార్యకలాపాల గురించి పోలీసులకు తెలియజేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు డ్రగ్స్ సంబంధిత సమస్యలను నివేదించడానికి EAGLE టోల్-ఫ్రీ నంబర్ 1908ను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యంతో జరుగుతున్నాయి.

  Last Updated: 08 Aug 2025, 07:13 AM IST