తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. శనివారం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాన్వాయ్ ను ఫాలో అవుతున్న పలు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వెళుతున్న కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ధ్వంసమవ్వగా.. పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు సమాచారం. అయితే గట్టిగా ఢీకొనడంతో కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి పెను ప్రమాదం తప్పినట్లైంది.
పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్లను సిబ్బంది వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎవరికి పెద్దగా ప్రమాదం జరగ్గపోవడంతో సెక్యూరిటీ (Sucurity) సిబ్బంది ఊపీరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తన పాదయాత్రకు ప్రభుత్వపరంగా సెక్యురిటీ పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.