Janmashtami Greetings: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుడు రచించిన పవిత్ర గ్రంథం ‘గీత’ ప్రాముఖ్యతను గురించి సీఎం వివరించారు. జీవితంలోని అన్ని దశలలోనూ ప్రజలను నడిపించడానికి ‘గీత’ నుండి పాఠాలు సమాజానికి ఎంత అవసరమో సీఎం రేవంత్ తెలిపారు. కృష్ణ భగవానుడి జ్ఞానం ప్రజలు అర్థవంతమైన జీవితాలను గడపడానికి సహాయపడుతుందని సీఎం అన్నారు. మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.
అంతకుముందు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు అని కేసీఆర్ పోస్ట్ చేశారు. శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వీళ్ళతో పాటు ఇతర ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరుసటి రోజు దహీ హండి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కూడా జన్మాష్టమి తేదీ రెండు రోజులు. ఈ గ్రహంలోని ప్రజలు ఈరోజు ఆగస్టు 26న జన్మాష్టమిని జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈరోజు శ్రీకృష్ణుని 5251వ జయంతి.
Also Read: Stock Market Live: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్