తెలంగాణ అంటే తమకు ఆత్మగౌరవమన్నారు టీపీసీసీ చీఫీ రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదన్నారు. హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రేవంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆరెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రైతుల కుటుంబాలను కేసీఆర్ ఆగం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకేసారి రెండులక్షల రుణమాఫీ చేస్తామని హామీచ్చారు. ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం చేస్తామన్నారు. భూమిలేని కౌలు రైతులకు ఎకరానికి రూ.12వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే…రైతులు పండించిన పంటలన్నింటిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి…పసుపు రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
మరోవైపు ఇందిరమ్మ రైతు భరోసా పథకం అమలుచేయడంతోపాటుగా…అన్ని పంటలకు గిట్టబాటు ధరలు కల్పిస్తామన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పంటల బీమా అమలు చేసి నష్టపరిహారం వెంటనే అందిస్తామని చెప్పారు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. పోడు రైతులక పట్టాలు ఇస్తామని..పెండింగ్ ప్రాజెక్టులను అన్నింటిని పూర్తి చేస్తామని చెప్పారు. చట్టపరంగా రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక వరికి ప్రస్తుతం మద్దతు ధర రూ. 1960 ఉందని…క్వింటాల్ వడ్లను రూ. 2500చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు. పసుపు పంటను క్వింటాల్ కు 12వేల కొనుగోలు చేస్తామని వెల్లడించారు. మొక్క జొన్న పంటకు క్వింటాల్ కు రూ. 3500చెల్లిస్తామన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు. వరంగల్ డిక్లరేషన్ హిస్టరీలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Rahul ji consoling the families of farmers who committed suicide…
Congress will wipe their tears & bring change in their lives.
Congress always with farmers. #raithusangarshanasabha pic.twitter.com/7jFkcgssRl
— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022