హోంగార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు బహిరంగ లేఖ రాశారు. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని రేవంత్ తన లేఖలో సీఎంకు వివరించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తారని అన్నారు. 200 కోట్లు వెచ్చించి దేశంలోని మీడియాలో ప్రకటనలు ఇచ్చారని సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న 10 సమస్యల గురించి ఆలోచించారా, జీతాలు లేకుండా హోంగార్డుల కుటుంబాలు ఎలా జీవిస్తాయో అని సీఎంను ప్రశ్నించారు.
‘‘అప్పుల ద్వారా,భూముల అమ్మకం ద్వారా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా,కరెంట్,భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల, బస్ ఛార్జీల పెంపు ద్వారా,మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో ?’’ అంటూ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది
అప్పుల ద్వారా,భూముల అమ్మకం ద్వారా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా,కరెంట్,భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల, బస్ ఛార్జీల పెంపు ద్వారా,మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో ?— Revanth Reddy (@revanth_anumula) June 22, 2022