Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అక్కడి నుండే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ కమిషనర్కు సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక రామోజీ కుటుంబ సభ్యులతో ఫోనులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాగా, మన దేశంలో ఓ మీడియా దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనుండటం ఇదే తొలిసారి.
రామోజీరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ట్వీట్ చేశారు. రామోజీ మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటు అని ఆయన చెప్పారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని రేవంత్ తెలిపారు. తెలుగువారి కీర్తిని దేశం నలుమూలల వ్యాపింపచేయడంలో రామోజీరావు కీలక పాత్ర పోషించారన్నారు. రామోజీ రావు ఏ రంగంలోకి అడుగిడినా విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేశారని రేవంత్ చెప్పారు. పత్రికా నిర్వహణ ఒక సవాల్ అనుకునే పరిస్థితుల్లో ఐదు దశాబ్దాల పాటు ఈనాడు పత్రికను నెంబర్ వన్ స్థానంలో నడపడం, ఈటీవీ స్థాపనతో టీవీ మీడియా రంగానికి దశాదిశా చూపిన దార్శనికుడు రామోజీరావు అని సీఎం రేవంత్ కొనియాడారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో భేటీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రామోజీరావు మరణం తెలుగు మీడియా రంగానికీ, వ్యాపార రంగానికీ తీరని లోటు అని పేర్కొన్నారు. రామోజీరావు(Ramoji Rao) ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీఎం రేవంత్ తెలియజేశారు.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
We’re now on WhatsApp. Click to Join
రామోజీరావు మరణంపై సంతాపం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. “రామోజీ రావు మరణం చాలా బాధాకరం. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. ఆయన జర్నలిజం, చలనచిత్ర ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. మీడియా, వినోద ప్రపంచంలో రామోజీరావు కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. గతంలో చాలా సందర్భాల్లో రామోజీరావును కలిసి మాట్లాడే అవకాశం లభించడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. ఆయా సమావేశాల సందర్భంగా రామోజీరావు నుంచి నాకు జ్ఞానం, ప్రయోజనం లభించాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ అసంఖ్యాక అభిమానులకూ నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్లో పేర్కొన్నారు.
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుంది.
తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు గారు… pic.twitter.com/QEfjfOuN2E
— Revanth Reddy (@revanth_anumula) June 8, 2024