BJP MLA Raja Singh : గ‌వ‌ర్న‌ర్‌కు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే భార్య లేఖ‌.. త‌న భ‌ర్త‌ను.. ?

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ క‌లిసి లేఖ అందించారు....

  • Written By:
  • Publish Date - September 19, 2022 / 09:56 AM IST

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ క‌లిసి లేఖ అందించారు. తన భర్తను జైలు నుంచి విడుదల చేసేందుకు సహకరించాలని కోరారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను రాజాసింగ్ తరచూ ఎత్తిచూపారని, అందుకే ఆయనను అరెస్టు చేశారని ఆమె అన్నారు. రాజా సింగ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్‌తో సహా పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. కోర్టులో తప్పుడు కేసులకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని ఉషాబాయి గవర్నర్‌కు తెలిపారు. రాజా సింగ్‌పై అభియోగాలను రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.

ఇతర రాజకీయ నాయకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా వారిపై పోలీసు అధికారులు కేసులు నమోదు చేయలేదని ఉషాబాయి ఆరోపించారు. రాజా సింగ్ విడుదలకు చొరవ తీసుకోవాలని ఆమె గవర్నర్ సౌందరరాజన్‌ను కోరారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. రాజా సింగ్ కుటుంబ సభ్యులు ఉషాబాయి వెంట ఉన్నారు. రాజా సింగ్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు వేర్వేరు కేసుల్లో నోటీసులు అందించిన తర్వాత పోలీసులు ఆగస్టు 25న ఆయ‌న్ని అరెస్ట్ చేశారు. రాజాసింగ్‌పై పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా ప్రయోగించారు. ఆయ‌న ప్ర‌స్తుతం జైల్లోనే ఉన్నాడు.