బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasigh) తన పార్టీ నాయకులపై చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని, కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని రాజాసింగ్ సవాల్ విసిరారు. అంతేకాకుండా, ఇద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరి దమ్ము ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన కిషన్ రెడ్డికి నేరుగా సవాల్ చేశారు.
GST Slab Effect : భారీగా తగ్గిన బుల్లెట్ బైక్ ధర!
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితికి కిషన్ రెడ్డే కారణమని రాజాసింగ్ ఆరోపించారు. ఆయన నాయకత్వం వల్లే పార్టీ నాశనమైందని విమర్శించారు. అలాగే, పార్టీలో ఇతర నేతలపైనా రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచందర్ రావు ఒక రబ్బర్ స్టాంప్గా మారారని, ఆయనకు పార్టీలో ఎలాంటి పట్టు లేదని ఆయన అన్నారు. బీజేపీలో నాయకత్వ లోపం తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. పార్టీ అధిష్ఠానం పిలిస్తేనే పార్టీలో చేరతానని, లేకపోతే స్వతంత్రంగా ఉంటానని కూడా ఆయన స్పష్టం చేశారు.
కొత్త కమిటీని ఏర్పాటు చేసినా, బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని రాజాసింగ్ చేసిన ప్రకటన ఆయన తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలియజేస్తోంది. ఈ వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానానికి ఒక సంకేతంగా కనిపిస్తున్నాయి. అంతర్గత విభేదాలను పరిష్కరించకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని రాజాసింగ్ చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో, కిషన్ రెడ్డి ఈ ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.