MLC Kavitha : రాజకీయ లబ్ధి కోసమే రాహుల్ పర్యటన!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఓయూ విద్యార్థులతో సమావేశం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
TRS Kavitha CBI DelhinLiquor Scam

TRS Kavitha

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఓయూ విద్యార్థులతో సమావేశం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదని, ఇప్పుడు వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీలకు ఎందుకు వస్తున్నారో తెలియడం లేదని అన్నారు. వరి పంట అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని టీఆర్‌ఎస్‌ కోరినప్పుడు కూడా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదని కవిత అన్నారు. వరి కొనుగోళ్ల సమస్యలపై మేం ఆయనను (రాహుల్ గాంధీ) పార్లమెంటులో అంశాన్ని లేవనెత్తాలని, తెలంగాణ రైతులకు మద్దతు ఇవ్వాలని కోరాం. కానీ రాహుల్ ఎలాంటి మద్దతివ్వలేదు. కానీ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణకు వస్తున్నారు’’ అని కవిత అన్నారు.

కాగా తెలంగాణ హైకోర్టు కోరిన నేపథ్యంలో రాహుల్ గాంధీ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులతో సమావేశం చేసేందుకు అనుమతించబోమని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పునరుద్ఘాటించారు. రాహుల్ గాంధీని యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతించకూడదనే మా నిర్ణయం అలాగే ఉంటుంది. అతను విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడానికి అనుమతించబడడు. ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం అలాగే ఉంటుంది” అని వీసీ రవీందర్ యాదవ్ అన్నారు.

  Last Updated: 04 May 2022, 06:59 PM IST