Site icon HashtagU Telugu

BRS New Plan : లోక్‌సభ పోల్స్‌కు కేసీఆర్ ‘న్యూ’ ప్లాన్.. ఏమిటది ?

Kcr Vs Congress

Kcr Vs Congress

BRS New Plan : లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ  ‘కొత్త’ స్కెచ్ గీస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు  చేస్తున్నారట. సిట్టింగ్ అభ్యర్థుల్లో బలంగా ఉన్న ఒకరిద్దర్ని తప్ప మిగతా అన్నిచోట్లా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం పలువురు తటస్థులైన ప్రముఖుల్ని గులాబీ బాస్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని కేసీఆర్ సంప్రదించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి కొన్నిచోట్ల ఈవిధంగా ఎవరూ ఊహించని అభ్యర్థులను కేసీఆర్ బరిలోకి దింపే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు నల్లగొండ, పాలమూరు వంటి చోట్ల అనూహ్యమైన బీఆర్ఎస్ అభ్యర్థులు(BRS New Plan) రంగంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల టైంలో..

గత ఎన్నికల టైంలో ఒక్కో బీఆర్ఎస్ లోక్‌సభ టిక్కెట్ కోసం సగటున ఐదు నుంచి పది మంది పోటీపడ్డారు. ఈసారి అంత పోటీ లేదు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ ఇంకా ఆ సీటును ఎవరికీ ఖాయం చేయలేదు. చివరికి కేసీఆర్ కుటుంబ సభ్యులకూ టిక్కెట్లను ఇప్పటిదాకా ఖరారు చేయలేదు.  చివరికి మెదక్ నుంచి కేసీఆర్ , నిజామాబాద్ నుంచి కవిత పేర్లను కూడా ప్రకటించలేదు. దీంతో వారిద్దరూ ఆయా స్థానాల్లో పోటీ చేయడం లేదని తేలిపోయింది. సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి ఈసారి మొండిచెయ్యే ఇవ్వబోతున్నారట. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి 9 మంది లోకసభ సభ్యులు ఉండగా.. వారిలో ముగ్గురికి మాత్రమే ఈసారి పోటీ చేసే ఛాన్స్ దక్కొచ్చు. లోక్ సభ ఎన్నికలంటే జాతీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ..  తమకే ఓటు వేయాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి పోటీకి అభ్యర్థులు వెనుకాడుతున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉండటంతో.. షెడ్యూల్ రాగానే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ స్థానాలు కీలకం.. 

Also Read: Harsha Kumar : ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల ఎఫెక్ట్.. టీడీపీలోకి హర్షకుమార్ ?