Site icon HashtagU Telugu

Ponnam Prabhakar : రామచందర్ లేఖపై మంత్రి పొన్నం ఫైర్

Ponam Prabhakar

Ponam Prabhakar

Ponnam Prabhakar : తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేత రాంచందర్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి రాంచందర్ రావు లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. “కేంద్రం నుంచి ఏకాణా తేలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విడ్డూరం” అంటూ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీజేపీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అబద్ధాలను ప్రచారం చేయడం తప్ప చేసింది లేదన్నారు. రైతులు, యువత, మహిళలు, బడుగు, బలహీన వర్గాలన్నీ మోసపోయాయని విమర్శించారు.

2019లో బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన 60 ఏళ్లు పైబడిన చిన్నకారు రైతులకు పింఛన్, కిసాన్ సమ్మాన్ నిధిని పెంచే హామీలను మర్చిపోయారంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన 8 ఎంపీలు ఉన్నా వారు నిధుల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

పెట్రోల్ ధరలు రూ.70 నుంచి రూ.110కి, గ్యాస్ సిలిండర్ ధరలు రూ.400 నుంచి రూ.1,100కి పెరిగాయని గుర్తు చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, కృష్ణా నీటి వాటాను తేల్చకుండా ఊరేగించడం కూడా బీజేపీ తీరునే చూపుతోందన్నారు.

“రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలమే అవుతోంది. ఈలోపే అన్ని చేయాలంటూ లేఖలు రాయడం, అది కూడా కేంద్రం చేసిన దాహకాల పాలనను మరచిపోయి, రాష్ట్రాన్ని విమర్శించడం… మీరు గల గుడ్డిద్వేషానికి నిదర్శనం” అని మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీకి లేఖ రాసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సవాలు విసిరారు.

AP HighCorut: ఆంధ్రప్రదేశ్‌లోని జడ్డీలకు హైకోర్టు సంచలన ఆదేశాలు

Exit mobile version