PM Modi Visit:హైద‌రాబాద్ లో `ఎగిరే వ‌స్తువుల‌` నిషేధం

రిమోట్ ఆప‌రేష‌న్స్ ద్వారా ఎగిరే వ‌స్తువుల‌ను నిషేధిస్తూ హైద‌రాబాద్ పోలీసులు కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Bjp Team

Bjp Team

రిమోట్ ఆప‌రేష‌న్స్ ద్వారా ఎగిరే వ‌స్తువుల‌ను నిషేధిస్తూ హైద‌రాబాద్ పోలీసులు కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ భ‌ద్ర‌త దృష్ట్యా రిమోట‌ కంట్రోల్డ్ డ్రోన్‌లు, పారాగ్లైడర్‌లు, రిమోట్‌గా నియంత్రించబడే మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగురవేయడం, ఆపరేట్ చేయ‌డాన్ని నిషేధించారు. జులై 2, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నుండి 5 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఎగిరే వ‌స్తువుల‌ను ఆప‌రేట్ చేయ‌డానికి లేద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. గచ్చిబౌలిలోని సెంటర్ (హెచ్‌ఐసిసి) చుట్టూ భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తూ ఈ ఉత్తర్వులు జూన్ 30 ఉదయం 6 గంటల నుండి జూలై 4 సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్ల‌డించారు.

“పారాగ్లైడర్లు, రిమోట్-నియంత్రిత డ్రోన్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ మొదలైనవాటిని ఉపయోగించి తీవ్రవాద, సంఘవ్యతిరేక దాడులు నిర్వహించవచ్చని తెలిపారు. ఇతరులు వైమానిక వీక్షణలను పొందడానికి డ్రోన్‌లను ఉపయోగించే ధోరణి పెరుగుతోందని నా దృష్టికి తీసుకురాబడింది. వివిధ ఈవెంట్‌ల ప్రత్యక్ష ప్రసారాలు మరియు ఫోటోగ్రఫీ, డ్రోన్‌లను ఉపయోగించడం ద్వారా దాడులు చేసే అవకాశం పడవచ్చు మరియు శాంతి మరియు ప్రజా ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు, అందుకే ఆదేశాలు జారీ చేయబడ్డాయి, ”అని ఆయ‌న వివరించారు.

డ్రోన్లు లేదా పారాగ్లైడర్లు లేదా రిమోట్‌తో నియంత్రించబడే మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో దాడులు జరగకుండా నిరోధించడానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంఘవిద్రోహశక్తుల కార్యకలాపాలపై తనిఖీలు విధించినట్లు ఆయన తెలిపారు. “ఈ ఉత్తర్వును ఉల్లంఘించే ఎవరైనా భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 188, 121, 121(a), 287, 336, 337, 338 మొదలైన వాటి ప్రకారం శిక్షార్హులవుతారు,” అని ర‌వీంద్ర హెచ్చ‌రించారు.

  Last Updated: 30 Jun 2022, 02:20 PM IST