తెలంగాణలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆమె బీర్కూర్లోని చౌకధరల దుకాణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై టీఆర్ఎస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిర్మలా సీతరామన్ పై ఎదురుదాడికి దిగారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పలు కేంద్ర పథకాలపై కూడా కేసీఆర్ ఫొటో పెట్టాలని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సీతరామన్ కామెంట్స్ పై వ్యంగ్యంగా స్పందిస్తూ పలువురు గ్యాస్ సిలిండర్ల ఆటోకు సంబంధించిన వీడియోను నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్లపై ‘మోదీజీ రూ.1105’ అనే వ్యాఖ్యతో ప్రధాని ఫొటోలు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విటర్లలో పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది.
You wanted pictures of Modi ji ,
Here you are @nsitharaman ji …@KTRTRS @pbhushan1 @isai_ @ranvijaylive @SaketGokhale pic.twitter.com/lcE4NlsRp5— krishanKTRS (@krishanKTRS) September 3, 2022