PM Modi Serious: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలను మందలించినట్లు (PM Modi Serious) తెలుస్తోంది. రాష్ట్ర యూనిట్ పనితీరు, సీనియర్ నాయకుల మధ్య సమన్వయం లోపంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణతో పాటు ఇతర దక్షిణ రాష్ట్రాల ఎంపీలతో సమావేశమై రాజకీయ పరిస్థితిని అంచనా వేసి, పార్టీ సంస్థాగత సంసిద్ధతను సమీక్షించారు. గణనీయమైన వృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ సరైన సమన్వయం లేకపోవడం, ప్రజల్లోకి సరిగా వెళ్లకపోవడం వల్ల పార్టీ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతోందని ఆయన తెలంగాణ ఎంపీలకు చెప్పినట్లు సమాచారం. ప్రజలను చేరుకోవడంలో, క్షేత్రస్థాయిలో పార్టీ కనబడే విధంగా బలోపేతం చేయడంలో పార్టీ కార్యాచరణ ప్రణాళికకు సమష్టి కృషి అవసరమని ఆయన ఎంపీలకు గుర్తు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి సహాయాన్ని చురుకుగా ప్రజలకు తెలియజేయాలని కూడా మోదీ ఎంపీలను ఆదేశించారు. రాష్ట్రానికి అందుతున్న ఆర్థిక మద్దతు గురించి స్పష్టంగా వివరించడానికి నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Accident : ఏపీలో రోడ్డు ప్రమాదాల కారణంగా నిన్న ఒక్కరోజే ఏపీలో 16 మంది మృతి
మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. భవిష్యత్తు ఎన్నికల్లో బీజేపీ జెండాలు ఎగురవేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి పార్టీ నాయకులను కోరారని చెప్పారు. మండల, గ్రామ స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజల తరపున పోరాడి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె తెలిపారు.
కాంగ్రెస్తో మనోళ్ల దోస్తీ ఏంటి?
ఢిల్లీ విందులో తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడకుండా స్నేహంగా మెలుగుతున్నారంటూ మోదీ అసహనం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఎదగలేకపోతుందని మోదీ ఆగ్రహించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం ఉంటూ చురుకుగా పని చేయడంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎంపీలు యాక్టీవ్గా లేరని, ఓవైసీని చూసి నేర్చుకోండని చురకలు అంటించారని కథనంలో పేర్కొన్నారు.
