Site icon HashtagU Telugu

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Phone tapping case..KCR, KTR should go to jail: Konda Vishweshwar Reddy

Phone tapping case..KCR, KTR should go to jail: Konda Vishweshwar Reddy

Phone Tapping Case : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం సిట్ ముందు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఆయనను విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం

నా ఫోన్‌ను గతంలో ఎన్నోసార్లు ట్యాప్ చేశారు. అప్పుడే నేను అధికారులకు ఫిర్యాదు చేశాను. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే నాపై తప్పుడు కేసులు బనాయించారని నాపై కుట్ర పన్నారని నాకు గట్టి అనుమానం ఉంది” అని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుదీర్ఘ కుట్ర. దీనికి ఆజ్ఞలు ఎక్కడినుండొచ్చాయో, ఎవరెవరు ఇందులో భాగమయ్యారో మొత్తం వెలుగులోకి రావాలి అని అన్నారు.

ఈ ఘటనపై పార్లమెంటు వేదికపై కూడా ప్రశ్నిస్తానని స్పష్టం చేసిన విశ్వేశ్వర్ రెడ్డి, దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవసరమైతే కేంద్రం సహాయంతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, తద్వారా ఈ వ్యవహారాన్ని సమగ్రంగా వెలుగులోకి తేవాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ తమ హోదాలను దుర్వినియోగం చేసి, ప్రైవసీని భంగపరిచారు. వాళ్లను జైలుకు పంపకపోతే ప్రజలకు న్యాయం జరగదు” అని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పాత పాలనలో జరిగిన అక్రమాలపై విచారణలు వేగంగా సాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ దిశగా వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖుల పేర్లు ఈ కేసులో చర్చకు వస్తుండటంతో మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డి సిట్ విచారణలో హాజరవడం ఈ కేసులో కీలకంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, అధికార పార్టీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొట్టుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజాలు ఏంటో విచారణలో తేలాల్సిందే. కానీ ఈ కేసు రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారడం మాత్రం ఇప్పుడే స్పష్టమవుతోంది.

Read Also: TGEAPCET : టీజీఈఏపీసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల